Thursday, 3 June 2010
శ్రీ రామకృష్ణ కథామృతము
తొలి పలుకులు
మహాత్ములు
మహాత్ములలొ రెండురకాలవారు ఉన్నారు.ఒక రకం వారు సామాన్యుల్లా జన్మించి ఆధ్యాత్మిక విజయాలు సాధించి పరిపూర్ణ స్థితిని పొందేవారు.వీరు సాధారణ గురువులు, ఆచార్యులు. మరొక కోవకు చెందిన మహాత్ములుపరిపూర్ణులుగానే జన్మిస్తారు. సొంతలాభం, స్వార్ధప్రయోజనాల కోసం కాకుండా ఇతరులకు సోదాహరణగా ఉండాలని మాత్రమే వీరు ఆధ్యాతిక సాధనానుష్టానాలు చేపడతారు. వీరు అవతార పురుషులు.
మహాత్ముల సేవ
రెండు రకాల ధర్మాలు ఉన్నవి. ౧. విశిష్ట ధర్మం. ౨. సామాన్య ధర్మం. విశిష్ట ధర్మం అన్నది బాహ్యజీవితానికి సంబంధించినది.సమాజంలొ ఒకరి స్థానానికి తగ్గట్టు వారు చేయవలసినవి,చేయకూడనివి మొదలైన వాటిని నిర్ణయించేది ఇది. సామాన్య ధర్మం అంతరంగానికి సంబంధించినది. ఒకరు తమకు తామే చేసుకొని, తమను దైవీస్థితికి పెంచుకోవటానికి తగ్గ మార్గాలను, పద్ధతులను చూపేది ఇది.
విసిష్ట ధర్మం నశించే సందర్భంలో మొదటీ కోవకు చెందిన మహనీయులు జన్మిస్థారు. భగ్నమైన ఆ నిర్ణీత ధర్మాన్ని పునరుద్ధరించడానికి మార్గం చూపుతారు. తరువాత నిష్క్రమిస్తారు. ఒక నిర్ణీత కాలానికి ఒక నిర్దిష్టస్థలంలొ నిర్ణీత కార్యం ఒక దానిని నిర్వర్తించటానికి రావటం వలన వీరి ప్రభావం ఒక నిర్ణీతపరిధి లోపలే ఇమిడిపోతుంది. కాలగతిలో మానవాళి వీరిని మరచి పోవడము కద్దు.
అయితే సామాన్యధర్మం నశించే వేళ _ మనిషి మనిషిగా జీవించడాన్నే మరచిపోవడానికి యత్నించేటప్పుడు, దివ్య జీవితాన్ని త్యజించటానికి తెగించేటప్పుడు రెండవ కోవ మహాత్ములు అవతరిస్తారు. వీరు యావత్ మానవజాతికి సంబంధించిన ఒక సందేశంతో వస్తారు.వీరి జీవితము సందేశము దేశకాలాలకు అతీతమైనైగా ఒప్పరుతుంది. వీరి జీవితకాలంలో కొద్దిమంది మాత్రమే వీరిని గుర్తిస్తారు. అయితే వీరి నిర్యాణానంతరం వీరి సిద్దాంతాలూ,బొధించిన సత్యాలూ విశ్వరూపం సంతరించుకోని ప్రపంచాన్ని చుట్టి వేస్థాయి. కాలం గడిచేకొద్దీ అవి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ కోటానుకోట్ల జన జీవితాలకు ఆదర్శనీయంగా భాసిల్లుతాయి.
Subscribe to:
Post Comments (Atom)


No comments:
Post a Comment